Powered By Blogger

Monday 28 December 2015

పింగళి నాగేంద్రరావు - నివాళి


పింగళి నాగేంద్రరావు గారి జయంతి సందర్భంగా నా నివాళి. వీరు ఒక తెలుగు సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే. వీరు ఒక రచయితగా తెలుగు సినీ రంగానికి చేసిన సేవ ఎంత విశిష్టమయినదో ఈ క్రింది చిత్రాలే చెబుతాయి.
రాజకోట రహస్యం (1971) గీతరచన
అగ్గిమీద గుగ్గిలం (1968) (కథ, సంభాషణలు, గీతాలు)
సి.ఐ.డి (1965) (రచయిత)
శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (చిత్రానువాదం)
మహామంత్రి తిమ్మరుసు (1962) (రచయిత)
గుండమ్మ కథ (1962) (చిత్రానువాదం)
జగదేకవీరుని కథ (1961) (రచయిత)
మహాకవి కాళిదాసు (1960/I) (సంభాషణలు) (చిత్రానువాదం)
అప్పు చేసి పప్పు కూడు (1959) (గీతరచన)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (సంభాషణలు) (కథ)
మాయా బజార్ (1957/I) (సంభాషణలు) (కథ) (చిత్రానువాదం)
మిస్సమ్మ (1955) (రచయిత)
చంద్రహారం (1954) (రచయిత)
పాతాళ భైరవి (1951) (సంభాషణలు) (కథ)
గుణసుందరి కథ (1949) (సంభాషణలు)
వింధ్యరాణి (1948) (సంభాషణలు) (కథ)
భలే పెళ్లి (1941) (గీతరచన)
శ్రీకృష్ణ లీలలు (1935) (సంభాషణలు).
(సేకరణ: వికీపీడియా)

No comments:

Post a Comment