Powered By Blogger

Friday 11 December 2015

ఎమ్మెస్. సుబ్బులక్ష్మి - పెన్సిల్ చిత్రం


ఈ రోజు అమరాగాయని ఎమ్మెస్. సుబ్బులక్ష్మి వర్ధంతి. ఆ  మహా గాయానికి నా పెన్సిల్ చిత్రం ద్వారా ఘన నివాళి.
మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (సెప్టెంబర్ 161916 – డిసెంబర్ 112004), (ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలేదా ఎం.ఎస్.గా ప్రాచుర్యం పొందారు), సుప్రఖ్యాతురాలైనకర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. - వికీపీడియా

1 comment: