Powered By Blogger

Wednesday, 30 December 2015

Appu Chesi Pappu Koodu || Moogavaina Emi Full Video Song || NTR, Savitri...





జగయ్య గారి జయంతి సందర్భంగా ఈ సన్నివేశం, పాట ఓసారి స్మరించుకుందాం.

Monday, 28 December 2015

పింగళి నాగేంద్రరావు - నివాళి


పింగళి నాగేంద్రరావు గారి జయంతి సందర్భంగా నా నివాళి. వీరు ఒక తెలుగు సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే. వీరు ఒక రచయితగా తెలుగు సినీ రంగానికి చేసిన సేవ ఎంత విశిష్టమయినదో ఈ క్రింది చిత్రాలే చెబుతాయి.
రాజకోట రహస్యం (1971) గీతరచన
అగ్గిమీద గుగ్గిలం (1968) (కథ, సంభాషణలు, గీతాలు)
సి.ఐ.డి (1965) (రచయిత)
శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (చిత్రానువాదం)
మహామంత్రి తిమ్మరుసు (1962) (రచయిత)
గుండమ్మ కథ (1962) (చిత్రానువాదం)
జగదేకవీరుని కథ (1961) (రచయిత)
మహాకవి కాళిదాసు (1960/I) (సంభాషణలు) (చిత్రానువాదం)
అప్పు చేసి పప్పు కూడు (1959) (గీతరచన)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (సంభాషణలు) (కథ)
మాయా బజార్ (1957/I) (సంభాషణలు) (కథ) (చిత్రానువాదం)
మిస్సమ్మ (1955) (రచయిత)
చంద్రహారం (1954) (రచయిత)
పాతాళ భైరవి (1951) (సంభాషణలు) (కథ)
గుణసుందరి కథ (1949) (సంభాషణలు)
వింధ్యరాణి (1948) (సంభాషణలు) (కథ)
భలే పెళ్లి (1941) (గీతరచన)
శ్రీకృష్ణ లీలలు (1935) (సంభాషణలు).
(సేకరణ: వికీపీడియా)

Wednesday, 23 December 2015

పి. భానుమతి - పెన్సిల్ చిత్రం - ఆడుగడుగో అల్లడుగో అభినవనారీ మన్మధుడు


భానుమతి, ఎన్టీఆర్ నటించిన 'సారంగధర' చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. సారంగధరుని వర్ణిస్తూ ఆమె పాడిన ఈ అద్భుత గీతం, అంతకు తగ్గటుగా ఠీవి, దర్పం తో నడచి వస్తున్న ఎన్టీఅర్, ఈ పాట చిత్రీకరణ వెరసి  నభూతో నభవిష్యతి అనిపించాయి. భానుమతి గారి వర్ధంతి సందర్భంగా ఆమెకు నా నివాళి.

Thursday, 17 December 2015

సూర్యకాంతం



తెలుగువారికి పరిచయం అవసరంలేని అసమాన సహజనటి సూర్యకాంతం గారు. నేడు ఆ మహానటి వర్ధంతి సందర్భంగా నా స్మృత్యంజలి. (ఇది నేను వేసిన పెన్సిల్ చిత్రం).

Monday, 14 December 2015

My Slideshow - Art by Ponnada Murty - Inspiration Bapu





నేడు అసమాన చిత్రకారుడు, చిత్ర దర్శకుడు బాపు జయంతి. ఆ మహా మనీషి కి నా నివాళులు అర్పిస్తూ ఈ వీడియో. .

Friday, 11 December 2015

ఎమ్మెస్. సుబ్బులక్ష్మి - పెన్సిల్ చిత్రం


ఈ రోజు అమరాగాయని ఎమ్మెస్. సుబ్బులక్ష్మి వర్ధంతి. ఆ  మహా గాయానికి నా పెన్సిల్ చిత్రం ద్వారా ఘన నివాళి.
మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (సెప్టెంబర్ 161916 – డిసెంబర్ 112004), (ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలేదా ఎం.ఎస్.గా ప్రాచుర్యం పొందారు), సుప్రఖ్యాతురాలైనకర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. - వికీపీడియా

Saturday, 5 December 2015

ఘంటసాల - ఆదిభట్ల నారాయణదాసు - కళావర్ రింగ్


'కళావర్ రింగ్' అనబడే సరిదే లక్ష్మీనరసయమ్మ గురించి టూకీగా :
చతుర్బాణాలనే అభినయంలో ఉపయోగించాలి కానీ, నీవు పంచ బాణాళు ఉపయోగించావు. అందువల్ల స్థలం మైల పడింది. అందు చేత కళామ తల్లికి కలిగిన ఈ కళంకాన్ని భరించలేక ఈ రూపంలో నీకు తెలియ జేయవలసి వచ్చింది. అని అనడంతో సాష్టాంగ దండ ప్రణాలు ఆచరించి, తన బసకు తీసుకుపోయి, పండితు లిద్దరినీ సత్కరించి, కానుక లిచ్చి గౌరవించి శాస్త్రిగారి శిష్యురాలిగా చేరిపోయింది.
పాటకత్తెగానూ, ఆతక్త్తెగానూ ప్రశస్తి గాంచిన 'కళావర్ రింగ్.'
కచేరీ నృతానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త మెరుగులు దిద్ది, విజయనగరం రాజ నర్తకిగా, నాటకరంగ నటిగా, అమర గాయనిగా, చలన చిత్ర నటీమణిగా రసిక హృదయాలని రంజింపజేసిన కళాకారిణి కళావర్ రింగ్ అనే పేరుతో చెలామణి అయిన అయిన శ్రీమతి సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ. ఈవిడ విజయనగరానికి 8 మైళ్ళ దూరంలో వున్నకోరుకొంద గ్రామంలో 1908 లో జన్మించింది. 8 వ ఏటనే నర్తకిగా పేరు తెచ్చుకుంది. 5 వ తరగతి వరకూ ప్రాథమిక విదాభ్యాసం చేసి శ్రీ మద్ది లచ్చన్నగారి వద్ద సరిగమలు ప్రారంబించి, శ్రీ ద్వారం వెంకతస్వామి నాయుడు శిష్యులైన శ్రి మద్దిల సత్య మూర్తి, శ్రీ చాగంటి రంగ బాబు, శ్రీ కోటి పల్లి గున్నయ్య మొదలైన వారి వద్ద సమగ్ర సంగీత జ్ఞానం సంపాదించింది. నృత్య విద్యలో శ్రీమతి మద్దిల అప్పుడు, శ్రీమతి మద్దిల రాముడు వద్ద శిక్షణ పొందింది. మద్దిల హేమావతి, నరహరమ్మల వద్ద హిందూస్థానీ జావళీలు, క్షేత్రయ్య పదాభినయనం నేర్చుకుంది. 12 సంవత్సరాల వయస్సులోనే భోగం మేళం నాయకురాలుగా వ్వవహరిందింది. ఆమే నృత్యానికి అచ్చెరువందిన ప్రేక్షకులు ఆమెను కళావర్ రింగ్. అని పిలిచేవారు.  - పొన్నాడ మూర్తి